Rashmika Mandanna Latest Photos: కన్నడ బ్యూటీ రష్మిక మందనా ప్రస్తుతం ప్యాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నా ఫ్యాన్స్ కోసం ఒక స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది.
రకరకాలుగా ఫ్యాన్స్కు ఐ లవ్ యూ అని చెప్తూ ఫ్లైట్లో ఉన్న ఫోటోలు షేర్ చేసింది రష్మిక మందనా.
పైగా తను ఇలా రకరకాలుగా ఐ లవ్ యూ చెప్పడం ఎలా అనిపించింది అంటూ ఫ్యాన్స్ను అడిగింది.
రష్మిక మందనా ఐ లవ్ యూ పోస్ట్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తెగ లైకులు కొట్టేస్తున్నారు.
ప్రస్తుతం రష్మిక చేతిలో పలు ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటితో పాటు పలు బ్రాండ్ షూట్స్లో కూడా పాల్గొంటూ అసలు తీరిక లేకుండా గడిపేస్తోంది ఈ భామ.
ఇప్పటికే ‘యానిమల్’ మూవీతో బాలీవుడ్లో తనకంటూ ఫేమ్ సంపాదించుకున్న రష్మిక.. ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘సికిందర్’లో హీరోయిన్గా నటిస్తోంది.
తెలుగులో ‘కుబేర’, ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమాలతో బిజీగా ఉంది. అలాగే తమిళంలో కూడా పలు ప్రాజెక్ట్స్ ఓకే చేసింది.
ప్రస్తుతం తను చేస్తున్న సినిమాల నుండి ఎలాంటి అప్డేట్ రాకపోయినా అప్పుడప్పుడు సోషల్ మీడియా పోస్టులతో ఫ్యాన్స్ను పలకరిస్తుంది రష్మిక.