Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్పేట్లో ఏప్రిల్ 5, 1996న జన్మించింది.
కూర్గ్ పబ్లిక్ స్కూల్లో విద్యనభ్యసించింది.
అనంతరం ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని అందుకుంది.
ఇక రష్మిక సినిమాల్లోకి రాకముందు పలు ప్రకటనల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.
మొదటిసారిగా ‘ఛలో’ మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
వెంకీ కుడుముల – నాగ శౌర్య కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ మంచి హిట్ అయింది.
ఆ తర్వాత గీత గోవిందం, డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప వంటి సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
ఇప్పుడు టాలీవుడ్లో మోస్ట్ క్రేజీ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తుంది.
ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తోంది. నేడు ఈ బ్యూటీ బర్త్ డే సందర్భంగా రష్మిక కొత్త పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ మూవీతోపాటు ‘ది గర్ల్ఫ్రెండ్’ పేరుతో ఓ లేడీ ఓరియేంటెడ్ మూవీ చేస్తుంది. దీనికి సంబంధించిన లుక్ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.
ఇక రష్మక తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్లో తన సత్తా చాటుతోంది.