Mahesh Babu Family Visits Tirumala Temple: సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ‘ఎస్ఎస్ఎంబీ’ సినిమాతో ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఫ్యామిలీ కాలినడకన తిరుమల దేవాలయాన్ని దర్శించుకున్నారు.
మహేశ్ బాబు భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార కలిసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
బుధవారం సాయంత్రం అలిపిరి నుంచి కాలినడకన బయల్దేరారు.
రాత్రి 7.30 గంటలకు తిరుమల చేరుకున్నారు. అయితే అక్కడకు చేరుకున్న సమయంలో మార్గ మద్యంలో మెట్లకు పూజలు చేస్తూ కొబ్బరికాయలు కొట్టారు.
అనంతరం కాలినడకన స్వామివారి దర్శనానికి బయల్దేరారు.
ఇక చివర మెట్టు వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
దీంతో మహేశ్ బాబు ఫ్యామిలీని చూసేందుకు సినీ అభిమానులు, ప్రేక్షకులు తండోపతండాలుగా అక్కడకు చేరుకున్నారు.