ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది కృతి శెట్టి
అయితే ఈ బ్యూటీకి అందం విషయంలో మార్కులు పడ్డాయి కానీ.. సినిమాల విషయంలో మాత్రం నిరాశే మిగిలింది.
ఇటీవల తీసిన మనమే మూవీకీ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
ఇక ఈ బ్యూటీ ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
తాజాగా రెడ్ కలర్ శారీలో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.