Keerthy Suresh: సౌత్ హీరోయిన్ కీర్తి సురేష్ గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చింది దాదాపు దశాబ్దం గడిచింది. ఈ ఏడాది ఇయర్ ఛార్జ్ ఫుల్ చేసుకున్న ఆమె, ఏమనుకుందో తెలీదుగానీ.. తన ఆలోచనను బిజినెస్ వైపు డైవర్ట్ చేసింది.
బిజినెస్ అంటే జ్యువెలరీ షాపు మాత్రం కాదండోయ్. క్రికెట్ రంగంలోకి అడుగు పెట్టేసిందట. ప్రస్తుతం కేరళలో క్రికెట్ లీగ్ త్వరలో మొదలుకానుంది. అందులో తిరువనంతపురం జట్టుకు కో-ఓనర్గా వ్యవహరిస్తోంది.
సెప్టెంబరులో కేసీఎల్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో తిరువనంతపురం జట్టుతో దిగిన ఫోటోలను సోషల్మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ టోర్నీకి సంబంధించి మొత్తం 33 మ్యాచ్లు జరగనున్నాయి.
ఆరు జట్లు పాల్గొంటున్నాయి. కేరళ క్రికెట్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు స్టార్ నటుడు మోహన్లాల్. సినిమాలు లేనప్పుడు తన జట్టుతో ఎంజాయ్ చేస్తోంది. ఆ విధంగా క్రికెట్ అభిమానులకు దగ్గరవుతోంది.
ఫాలోవర్స్ పెంచుకునే పనిలో పడింది. అన్నట్లు కీర్తికి కేవలం మూడు పదుల వయస్సు మాత్రమే. మరో పదేళ్లు గ్లామర్ ఇండస్ట్రీలో రాణించాలంటే క్రికెట్ బెటరని భావించింది. అడుగు పెట్టేసింది.
ఏమో రేపటిరోజున ఐపీఎల్లో కో-ఓనర్గా కీర్తి సురేష్ వ్యవహరించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు హార్డ్ కోర్ ఫ్యాన్స్.