ఓ వైపు సినిమాలతో పాటు మరోవైపు రాజకీయాల్లోను ఎప్పటికప్పుడు ఏదొక అంశంలోను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే విషయంలోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది.
అందుకే కాబోలు కంగనా అంటే కాంట్రవర్సీ క్వీన్ అని పిలుస్తుంటారు.
కంగనా రనౌత్ తెలుగులో ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో ఏ సినిమా చేయలేదు.
గ్యాంగ్ స్టర్ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటించి సూపర్ క్రేజీ సంపాదించుంకుంది.
బాలీవుడ్ లో అతి తక్కువ పారితోషకం తీసుకునే నటుల్లో కంగనా ఒకరు.
కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఎమర్జెన్సీ.. దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుస్తున్నారు.
ఈ మూవీలో ఇందిరాగాంధీగా కంగనా నటిస్తోన్న విషయం తెలిసిందే.. సెప్టెంబర్ 6న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.
ఇక ఈ బ్యూటీ అటు రాజకీయాల్లోను, సినిమాల్లోను బిజీగా గడుపుతూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్ లతో కుర్రకారుకు కునుకులేకుండా చేస్తుంది. తాజాగా శారీ లుక్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ.