Priyanka Gandhi Nomination: ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగేశారు.
తొలిసారి కేరళలోని వయనాడ్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఇక్కడ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ రెండుసార్లు గెలిచారు. ఆ సీటుకు ఆయన రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఆ స్థానం నుంచి ప్రియాంకగాంధీ బరిలోకి దిగుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం వయనాడ్లో నామినేషన్ దాఖలు చేశారు ఆమె.
పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్రెడ్డి మిగతా సీనియర్లు అక్కడికి తరలి వెళ్లారు.
నామినేషన్ ముందు సీఎం రేవంత్రెడ్డి, ప్రియాంకగాంధీ (Priyanka Gandhi )కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఆమె శక్తి వంతమైన వాయిస్ను పార్లమెంటులో వినిపిస్తారని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా పార్టీ నేతలతో దిగిన ఫోటోలను సీఎం రేవంత్రెడ్డి ఎక్స్ ద్వారా అభిమానులతో షేర్ చేశారు. ఇప్పుడు వాటిపై ఓ లుక్కేద్దాం.