రష్మిక మొదట కన్మడ మూవీ కిరాక్ పార్టీ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది.
తెలుగులో ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ సరసన నటించి సూపర్ హిట్ అందుకుంది.
దేవదాస్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ లో నటించింది.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ని సొంతం చేసుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న
ఈ మధ్యనే యానిమల్ చిత్రంతో మరో సూపర్ డూపర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఈ బ్యూటీ పుష్ప 2 మూవీలో నటిస్తోంది.
ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.
తాజాగా అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ వెడ్డింగ్ వేడుకకు హాజరయింది. ఈ వేడుకలో సింపుల్ గా శారీ లుక్ లో మెరిసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.