OTT Horror Movie : ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ సినిమాలను జనాలు ఎక్కువగా చూసేవారు. కానీ ఇప్పుడు ఆ జానర్ లో సినిమాలు వస్తే జనాలు ఆసక్తి చూపించలేదు. అందుకే వచ్చిన సినిమా వచ్చినట్లే వెళ్తుంది. కొన్ని సినిమాలు అసలు వచ్చాయా అనే టాక్ ను అందుకుంటున్నాయి. అందుకే దర్శక నిర్మాతలు ఈ మధ్య హారర్ సినిమాలను తెరకేక్కించే పనిలో ఉన్నారు. ఇటీవల వచ్చిన ప్రతి సస్పెన్స్ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అందులో రీసెంట్ గా వచ్చిన ‘డిమోంటి కాలనీ 2’ సినిమా కూడా ఒకటి. ఆగస్ట్ 15న థియేటర్లలో అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఇదే సినిమాను తెలుగులో ఆగస్ట్ 23న విడుదలై చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే విధంగా కలెక్షన్స్ పరంగానూ హిట్టయ్యింది. గతంలో 2015లో సూపర్ హిట్ అయిన డిమెంటి కాలనీ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కించడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరి ఆ డీటెయిల్స్ ఏంటో ఒక లుక్ వేద్దాం..
అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరుళ్ నిథి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో అర్చన్ రవీంద్రన్, అంటి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్, ముత్తుకుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా థియేటర్ల లో మంచి టాక్ ను అందుకుంది. ఇక ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో స్ట్రీమింగ్ చేయబోతున్నారని ఆఫీషియల్ ప్రకటన వచ్చేసింది. సెప్టెంబర్ 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 లో స్ట్రీమింగ్ చేయనున్నారట. ఈ విషయాన్ని సెప్టెంబర్ 16న ప్రకటించింది జీ5. తమిళంతోపాటు తెలుగులోనూ అందుబాటులోకి తీసుకురానున్నారని సమాచారం.. చీకటి మళ్లీ వచ్చేస్తుంది.. ప్రతికారం తీసర్చుకోబోతుందని జీ5 అధికార అకౌంట్ లో పోస్ట్ చేసింది. 27 నుంచే తమిళం, తెలుగులో స్ట్రీమింగ్ కాబోతుందని సమాచారం..
ఇక ‘డిమోంటి కాలనీ 2’ కథ విషయానికొస్తే.. క్యాన్సర్ తో పోరాడుతున్న చావుకు దగ్గరరి లో ఉన్న వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అతడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ క్యాన్సర్ నుంచి కోలుకునేలా చేస్తుంది. కానీ అంతలోనే సామ్ ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో తన భర్త సూసైడ్ చేసుకోవడానికి గల కారణం తెలియలేదు. అతని చావుకు గల కారణాలను ఓబౌద్ధ గురువు సహాయంతో అతని ఆత్మ తో మాట్లాడుతుంది. సామ్ చదివిన ఓ పుస్తకమే అతడి చావుకు కారణమని.. అంతకుముందు కొందరు అలాగే చనిపోయారని తెలుసుకుంటుంది. ఆ పుస్తకం చదివిన మరికొందరి చావులను చెక్ పెట్టేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నం లో ఆమెకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి.. వాటిని దాటుకుంటూ ఆ పుస్తకాన్ని చదవకుండా చేసిందా? ఆమె ప్రయత్నం ఎంతవరకు ఫలించింది అనేది స్టోరీ..