35 Chinna Katha kaadhu.. తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది నివేదా థామస్ (Niveda thamos).. ఈమె తన కెరీర్ లో ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ పాత్రలలోనే నటిస్తూ ఉంటుంది. 2008లో మొదటిసారి తమిళంలో తన సినీ కెరీర్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ, నాని నటించిన జెంటిల్మెన్ సినిమాతో తొలిసారి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత నిన్ను కోరి, జై లవకుశ తదితర చిత్రాలలో నటించి బాగానే పాపులారిటీ అందుకుంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో కూడా నటించి తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇక చివరిగా షాకిని డాకిని అంటూ రెజీనాతో కలసి ప్రేక్షకులను అలరించిన ఈమె, చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఇప్పుడు 35 చిన్న కథ కాదు అనే సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
35 చిన్న కథ కాదు సినిమాతో రీ యంట్రీ ఇచ్చిన నివేదా..
ఇదిలా ఉండగా. గతంలో నివేద కాస్త స్లిమ్ గా ఎంతో అందంగా కనిపించింది. కానీ ఈ మధ్యకాలంలో సడెన్ గా బరువు పెరిగిపోయి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇటీవలే చాలాకాలం తర్వాత మళ్లీ ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “35 చిన్న కథ కాదు” (35 Chinna Katha kaadhu) అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా ఎమోషనల్ కామెడీ డ్రామాగా తెరకెక్కించారు డైరెక్టర్ నందకీషోర్ ఇమాని. ఇందులో ప్రియదర్శి , గౌతమి, విశ్వదేవ్ రాచకొండ తదితరులు కీలకమైన పాత్రలో నటించారు. సెప్టెంబర్ 6న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం సుమారుగా రూ.5 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టినట్లు తెలుస్తోంది. మొదటిరోజు పాజిటివ్ టాక్ తో దూసుకుపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తోంది.
ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసినట్లుగా సమాచారం. సెప్టెంబర్ 27న ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కాబోతోందట. మరో రెండు రోజుల్లో ఈ విషయం పైన అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. నివేద థామస్ 35 చిన్న కథ కాదు సినిమాలో విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక అరుదైన సందేశాన్ని చూపించారు. ముఖ్యంగా కుటుంబంలోని కొడుకు చదువు కోసం ఆరాటపడే తల్లి పాత్రలో నివేద థామస్ అద్భుతంగా నటించింది. చాలాకాలం తర్వాత మళ్లీ ఒక సూపర్ హిట్ సినిమాని చూసామని చూసిన ప్రేక్షకులు తెలిపారు. నిర్మాతలకు కూడా 35 చిన్న కథ కాదు అనే సినిమా లాభాలను తెచ్చి పెట్టినట్లు తెలుస్తోంది.
35 చిన్న కథ కాదు సినిమా కథ..
35 చిన్న కథ కాదు.. సినిమా స్టోరీ విషయానికి వస్తే ప్రసాద్ పాత్రలో (విశ్వదేవ్), సరస్వతి పాత్రలో (నివేదా థామస్) భార్య భర్తలు గా నటించారు. వీరి కొడుకు అరుణ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ చాలా వీక్ గా ఉంటారు. దీంతో తిక్క ప్రశ్నలతో టీచర్లను సైతం విసిగిస్తూ ఉంటాడు. ఇందులో టీచర్ చాణిక్యగా (ప్రియదర్శి) నటించారు అయితే ఈ స్కూలులో.. మ్యాథ్స్ 35 మార్కులు వస్తేనే ఈ స్కూలులో పిల్లలు చదువుకోవాలని కండిషన్ పెడతారట. దీంతో తన కొడుకుకి మ్యాథ్స్ నేర్పించడానికి తల్లిగా సరస్వతి ఏం చేసింది.. చివరికి 35 మార్కులు తన కుమారుడు తెచ్చుకున్నాడా లేదా అనే అనే కథాంశం తో తెరకెక్కించారు.