2024లో దేశానికి కాబోయే ప్రధానమంత్రి ఎవరు? ఇప్పుడు ఎందుకు ఈ ప్రశ్న అంటున్నారా? 2024లో ప్రధాని మోడీ మళ్లీ గెలిచే అవకాశం లేదట. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు కర్ణాటకకు చెందిన ఓ స్వామిజీ. ఆయన పేరు యశ్వంత్ గురూజీ. శనేశ్వర్ ఆలయంలో ఉంటున్న గురూజీ ప్రధాని మోడీ గురించి ఆసక్తికరమైన జోస్యం చెప్పారు.
2024లో ప్రధాని మోడీ పదవి నుంచి దిగిపోతారని గురూజీ తెలిపారు. మహా శివరాత్రి అనంతరం పరిణామాలు వేగంగా మారిపోతాయంటున్నారు. అంతే కాదు.. దేశానికి 2024లో ఓ మహిళ ప్రధానిగా ఉంటారని ఆయన చెబుతున్నారు. దీంతో ఎవరు ప్రధాని అవుతారనే విషయంపై ఆసక్తి నెలకొంది.
ఒకవేళ యశ్వంత్ గురూజీ చెప్పినట్టు 2024లో బీజేపీ కాకుండా ఇండియా కూటమి గెలిస్తే.. సోనియాగాంధీ లేక ప్రియాంక గాంధీ, మమతా బెనర్జీలాంటి వాళ్లు ప్రధాని అవుతారా? లేదంటే ఇంకెవరైనా మహిళకు ఆ ఛాన్స్ వస్తుందా? అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి యశ్వంత్ గురూజీ చెప్పిన జోస్యం.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది.