Yamuna River Pollution : కాలుష్యవర్థాలతో యమున నదిలో తెల్లటి నురగ భారీగా పేరుకుపోయింది. ఢిల్లీ చుట్టు పక్కల ఉన్న పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు, మురికినీరు యమునా నదిలోకి చేరుతుంది. దీంతో నదిలోని నీరు కలుషితమవుతోంది. ఈ నేపథ్యంలో కలింది కుంజ్ ఏరియాలోని యమునా నదిపై ఏర్పడిన విషపు నురుగును సిబ్బంది తొలగిస్తున్నారు. కెమికల్స్ ను నురుగపై జెట్ స్ప్రే చేస్తున్నారు.
ఉత్తరాధి రాష్ట్రాల్లో ఘనంగా చట్ పూజను నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే నదుల వద్ద పుణ్యస్నానాలు ఆచరించి సూర్య భగవానుడికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో భాగంగా 36 గంటల పాటు ఉపవాసం ఉంటారు. నదీ ఘాట్ల వద్ద స్నానం ఆచరించి.. అక్కడే దీపాలను వెలిగించి పూజలు చేస్తున్నారు.
యమునా నదిలో ఉన్న ఈ విషవ్యర్థాలు వల్ల ఇప్పటికే పరోక్షంగా ఢిళ్లీ వాసులు అనారోగ్యానికి గురౌతున్నారు. ఛాట్ పూజా కార్యక్రమం, ఉత్సవాల్లో ఇప్పుడు ఈ కలుషితమైన నది పై పెను ప్రమాదంగా పొంచి ఉంది. ఈ యమునా నదిలో దిగి పూజలాచరించడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు వ్యాపిస్తాయి. స్కిన్ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. కడుపులోకి గనుక వెళ్తే.. టైఫాయిడ్, ట్యూబర్కులాసిస్, మెదడుసంబంధిత వ్యాధులు, హార్మోన్ ఇమ్బ్యాలెన్స్ సంబంవించే ప్రమాదం ఉంది.