women workforce : తయారీ రంగంలో మహిళల పాత్ర తక్కువేమీ లేదు. దేశవ్యాప్తంగా ఈ రంగంలో 15,80,000 మంది నారీమణులు పనిచేస్తున్నారు.వీరిలో దాదాపు సగం మంది దక్షిణాది రాష్ట్రం తమిళనాడు నుంచి వచ్చినవారే కావడం విశేషం. దాదాపు 6,79,000 మంది మహిళలు ఆ రాష్ట్రంవారే.
యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీ(2019-20) మేరకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఈ వివరాలు వెల్లడించింది. అంతే కాదు.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(MSME)లను సొంతంగా నిర్వహిస్తున్న మహిళలు కూడా తమిళనాడులో ఎక్కువే.
MSMEలకు మహిళలు ఎక్కువగా నేతృత్వం వహిస్తున్న రాష్ట్రంగా తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. దేశ జనాభాలో తమిళనాడు వాటా ఆరు శాతం.
వర్క్ఫోర్స్లో మహిళల భాగస్వామ్యం పెరగడానికి తమిళనాడు ప్రభుత్వాలు తీసుకున్న చర్యలే కారణం. బాలికావిద్యను ప్రోత్సహించడంతో పాటు, మహిళలకు ఉచిత బస్ సర్వీసులు, ప్రభుత్వ స్కూళ్లలో ఉచిత బ్రేక్ఫాస్ట్ వంటివి కల్పించారు.