Pune: మంచి జీతం.. ఏసీ గదుల్లో ఉద్యోగం.. అయినా కూడా ఆమెకు స్యాటిస్ఫాక్షన్ లేదు. నిత్యం ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలే. ఈక్రమంలో ఉద్యోగానికే రాజీనామా చేసింది ఆ మహిళ. ప్రజల కోసం ఆర్టీసీ డ్రైవర్గా మారింది.
పుణెకు చెందిన శీతల్ శిందే అని మహిళ 2014 నుంచి నాలుగేళ్ల పాటు యాక్సిక్ బ్యాంక్ మేనేజర్గా విధులు నిర్వహించింది. ఆ తర్వాత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. కొన్ని రోజుల పాటు ఖాళీగా ఉండి.. చివరికి మహారాష్ట్ర ఆర్టీసీలో డ్రైవర్గా చేరింది.
2019లో మహారాష్ట్ర ఆర్టీసీ మహిళా డ్రైవర్ల భర్తీ ప్రక్రియను ప్రారంభించగా.. శీతల్ దానికి దరఖాస్తు చేసుకుంది. ఆ సమయంలో మొత్తం 194 మంది మహిళలు ఎంపికయ్యారు. అయితే అదే సమయంలో కరోనా మహమ్మారి రావడం… లాక్డౌన్ విధించడంతో భర్తీ ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో చివరకు కేవలం 17 మంది మహిళలు మాత్రమే మిగిలారు. వారిలో ఒకరు శీతల్ శిందే. ఈ ఏడాది మార్చిలో శీతల్ విధుల్లో చేరనుంది.