Atal Setu bridge: ముంబైలో అటల్ సేతుబ్రిడ్జి ఆత్మహత్యలకు కేరాఫ్గా మారిందా? అక్కడికే వచ్చి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఫ్యామిలీ సమస్యలా? అప్పుల బాధలా? ఇవే ప్రశ్నలు ముంబై వాసులను వెంటాడుతున్నాయి. తాజాగా 56 ఏళ్ల మహిళను కారు డ్రైవర్, పోలీసులు కాపాడారు. దీనికి సంబంధించిన ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది.
శుక్రవారం రాత్రి ఏడు గంటలు దాటింది. ముంబైలో అటల్సేతు బ్రిడ్జిపై ఓ కారు వచ్చి ఆగింది. కారు డ్రైవర్ రోడ్డుపై నిలబడగా, అందులోవున్న 56 ఏళ్ల మహిళ సైడ్ కూర్చొంది. మరి ఏం జరిగిందో తెలీదుగానీ సముద్రంలోకి దూకే ప్రయత్నం చేసింది. వెంటనే కారు డ్రైవర్ ఆమె జుట్టు పట్టుకున్నాడు.
ఈలోగా పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెని కాపాడారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. ఆ మహిళను అక్కడి నుంచి నవీ ముంబైలోని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. డీటేల్స్ సేకరించిన పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు కబురు పెట్టారు.
ALSO READ: కీలక ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. క్యాబినెట్ ఆమోదం
ఈ వ్యవహారంపై ట్రాఫిక్ పోలీసులు నోరు విప్పారు. అటల్ సేతు బ్రిడ్జిపై కారు ఆపి ఓ మహిళ ఏదో చేస్తోందంటూ ఫోన్కాల్ రావడంతో వెంటనే పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకున్నట్లు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ పేరు రీమా పటేల్. గృహిణి కూడా. ముంబై ఈశాన్యంలోని ములుంద్ ప్రాంతంలో ఉంటోంది. ఆమె చనిపోవడానికి గల కారణాలు ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది.
20 రోజుల వెనక్కి వెళ్తే.. జూలై 25న ముంబైలోని 38 ఏళ్ల సాప్ట్వేర్ ఇంజనీర్ కరుతురి శ్రీనివాస్ అటల్ బ్రిడ్జిపైకి కారుతో వచ్చి వెంటనే అందులోకి దూకేసి సూసైడ్ చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు కారణంగానే జరిగిందని తేలింది.
అంతకుముందు మార్చి 18న థానే జిల్లాకు చెందిన 38 ఏళ్ల మహిళా డాక్టర్ సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎనిమిదేళ్లుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నానని ఆమె ఇంట్లో దొరికిన లేఖలో బయటపడింది. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో ప్రస్తావించింది.
అటల్ సేతు బ్రిడ్జిపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ మహిళ.. పోలీసుల రాకతో..?
ముంబై – అటల్ సేతు బ్రిడ్జిపై నుండి దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. సకాలంలో అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ఆ మహిళ దూకుతుండగా పట్టుకొని కాపాడారు.#Mumbai #atalsetubridge #viralvideo… pic.twitter.com/w3fhaOtAcI
— BIG TV Breaking News (@bigtvtelugu) August 17, 2024