Rahul Gandhi News :వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పాల్గొంటారా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. రాహుల్ లోక్సభ సభ్యత్వ పునరుద్ధరణకు అవసరమైన పత్రాలను సోమవారం లోక్సభ సెక్రటేరియట్ పరిశీలించనుంది. అనంతరం మెరిట్ ఆధారిత నిర్ణయం తీసుకుని లోక్సభ స్పీకర్ ఓంబిర్లా సంతకం చేయనున్నారు.
పరువు నష్టం కేసులో రాహుల్ను దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఆయన పార్లమెంట్లో అడుగుపెతారా లేదా దానిపై ఉత్కంఠను రేపుతోంది. అనర్హత రద్దుపై లోక్సభ స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై ఆసక్తి నెలకొంది. లోక్సభ సభ్యత్వాన్ని తొలగించడంలో ఉన్న తొందర, పునరుద్ధరించడంలో ఎందుకు లేదంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ నిర్ణయం కోసం కాంగ్రెస్ వర్గాలు ఎంతో ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నాయి. తీర్పుపై స్టే విధిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
మరో వైపు కాంగ్రెస్ పార్టీ నేతలు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీలను స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. దీంతోపాటు ఆయనపై వేసిన అనర్హత వేటును రద్దు చేసేందుకు అవసరమైన పత్రాలను కూడా సిద్ధం చేసి ఓం బిర్లా టేబుల్ ముందుంచారు. ఇక ఆయన సంతకం చేయడమే తరువాయి. దాని తర్వాతే రాహుల్ సభలోకి వెళ్లేందుకు వీలుంటుంది. కాంగ్రెస్ వర్గాలు మాత్రం రాహుల్గాంధీపై అనర్హత వేటు వేసినంత వేగంగానే దానిని రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.