Mamata Banerjee Suffers Major Injury(Today’s news in telugu): పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గాయపడ్డారు. ఆమె నుదుటపై తీవ్ర గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో రక్తం ధార కారిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు ఈ విషయాన్ని ప్రకటించాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
మమత బెనర్జీ గాయంతో ఉన్న ఫోటీలను ఎక్స్ లో టీఎంసీ ఫోస్ట్ పెట్టింది. బెంగాల్ సీఎం కోలుకోవాలంటూ పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కోల్ కతాలో ప్రభుత్వ ఎస్ఎస్ కేఎం హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. దీదీ త్వరగా కోలుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Also Read: కొత్త ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియ పూర్తి.. సుఖ్బీర్ సంధూ, జ్ఞానేశ్ కుమార్ కు అవకాశం..
రెండు నెలల క్రితం కూడా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ ప్రమాదానికి గురయ్యారు. అధికారులతో మీటింగ్ తర్వాత బర్ధమాన్ నుంచి కోల్ కతా కు కారులో తిరిగి వస్తున్న సమయంలో ఆ ఘటన జరిగింది. సీఎం కాన్వాయ్ కు ఎదురుగా ఓ వాహనం ఎదురొచ్చింది. దీంతో ఆ కారును తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. ఆ సమయంలో ముందు సీట్లోనే సీఎం మమత బెనర్జీ కూర్చున్నారు. దీంతో విండ్ షీల్డ్ కు ఆమె తల తగిలింది. ఆమె గాయమైంది.