Viral News : మధ్యప్రదేశ్లోని ఇండోర్ లో దారుణం జరిగింది. పెంపుడు కుక్కల విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన వివాదం.. పెద్ద ఇష్యూగా మారింది. చివరికి కాల్పులకు దారి తీసింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా.. ఎనిమిది గాయపడ్డారు. వీరిలో ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇండోర్ లో ఉంటున్న రాజ్ పాల్ రజావత్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఆయనకు పక్కింటి వారికి తమ పెంపుడు కుక్కల విషయంలో శుక్రవారం రాత్రి వివాదం తలెత్తింది. దీంతో కోపోద్రిక్తుడైన రాజ్ పాల్.. తన గన్ తో విచక్షణా రహితంగా కాల్పుడు జరిపాడు. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికుల ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. రాజ్ పాల్ ను అదుపులోకి తీసుకొని తన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.