Uttarpradesh Crimes : యూపీలో మథుర జిల్లాలో దారుణం జరిగింది. ఒకే లారీలో 30 ఆవులను ఎక్కించి తరలిస్తుండగా లారీలో ఊపిరాడక 29 ఆవులు మృతి చెందాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మొత్తం 30 అవులలో ఒక్క ఆవు మాత్రమే బతికి ఉండడంతో దానిని పశువుల ఆసుపత్రికి తరలించారు. అంతలో లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు