Uttarakhand Road Accident(Today latest news telugu): ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రుద్రప్రయాగ్ జిల్లాలో 26 మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ అదుపు తప్పి లోతైన లోయలో పడింది. బద్రీనాథ్ హైవే సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న ఎస్డీఆర్ఎఫ్, పోలీసు బృందం సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని అంబులెన్స్లో సమీప ఆస్పత్రికి తరలించారు.
Also Read: ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్.. ఎనిమిది మంది మావోయిస్టులు హతం.. ఎదురు కాల్పుల్లో జవాన్ మృతి
రుద్రప్రయాగ్ నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో బద్రీనాథ్ హైవేపై రైటోలి సమీపంలో అలకనదిలో టెంపో ట్రావెలర్ పడినట్లు తెలుస్తోంది. నదిలో పడిన ఇద్దరిని ఎస్డీఆర్ఎఫ్ బృందం కాపాడగా.. గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.
స్పందించిన సీఎం..
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ససింగ్ ధామి స్పందించారు. ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు చర్యలు చేస్తున్నారని ట్వీట్ చేశారు. ప్రమాదంపై తక్షణమే విచారణ చేయాలని జిల్లా మేజిస్ట్రేట్కు ఆదేశాలు జారీ చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని బాబా కేదార్ని ప్రార్థిస్తున్నానని పుష్కర్ ధామి ఎక్స్లో పోస్ట్ చేశారు.
VIDEO | Uttarakhand: Around eight people lost their lives after a tempo, they were travelling in, fell into a gorge on Rishikesh-Badrinath national highway. More details are awaited.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/DrcaPhTfBX
— Press Trust of India (@PTI_News) June 15, 2024