EPAPER

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Uttar Pradesh Wolf Attacks| ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా తోడేళ్లు మానవ నివాస ప్రాంతాలపై దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు 8 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో 7 మంది చిన్న పిల్లలే ఉండడం ఆందోళనకర పరిస్థితులను సూచిస్తోంది. తాజాగా శుక్రవారం ఒక 8 ఏళ్ల బాలుడుపై తోడేళు దాడి చేసింది. ఈ దాడిలో ఆ పిల్లాడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి.


ఉత్తర్ ప్రదేశ్ లోని భైరాచ్, ఝాన్సీ ప్రాంతాల్లో తోడేళ్లు మనుషులపై విరుచుకుపడుతున్నాయి. దీంతో ఫారెస్ట్ విభాగం అధికారులు తోడేళ్లను పట్టుకునే పనిలో పడ్డారు. ఇప్పటివరకు 7 తోడేళ్లను పట్టకుని జూ పార్క్ లకు తరలించినట్లు తెలిపారు. అయినా దాడులు ఆగడం లేదు.

ఈ ఘటనలపై ఉత్తర్ ప్రదేశ్ మహిళా మంత్రి బేబీ రాని మౌర్యను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తోడేళ్లు దాడులు ఆపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి? అని విలేకరులు ప్రశ్నించగా.. మంత్రి బేబీ రాని మాట్లాడుతూ.. ‘తోడేళ్లను అంత సులువుగా పట్టుకోలేం. ఎందుకంటే ఆ జంతువులు ప్రభుత్వం కంటే తెలివనవి’ అని సమాధానమిచ్చారు.


”తోడేళ్ల కోసం చాలా మంది అటవీ శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. మేము వాటిని పట్టుకుంటామ. కానీ సమయం కావాలి. ఎందుకంటే తోడేళ్లు ప్రభుత్వం కంటే తెలివైన జంతువులు. ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. త్వరలోనే తోడేళ్లను పట్టకుంటాం. అటవీ శాఖ మంత్రి స్వయంగా ఈ సమస్యను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.” అని వ్యాఖ్యానించారు.

Also Read: కాల్ గర్ల్ తల నరికి యువతి సోదరుడి ఇంట్లో పెట్టిన ప్రియుడు.. ఎందుకు చేశాడంటే..

శుక్రవారం భైరాచ్ నగరంలో మహ్ సీల్ మండలంలో ఒక 8 ఏళ్ల బాలుడు ఇంటి బయట ఆడుకుంటుండగా అనుకోకుండా ఒక తోడేలు పిల్లాడిపై దాడి చేసిందని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. తోడేలు.. బాలుడి ముఖంపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ బాలుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. గత రెండు నెలలుగా జరుగుతున్న తోడేలు దాడుల్లో ఇప్పటివరకు 8 మంది చనిపోగా 36 మంది గాయపడ్డారని అధికారిక సమాచారం.

30 ఏళ్ల క్రితం కూడా ఇలాగే ఉత్తర్ ప్రదేశ్ లో తోడేళ్లు మనుషులపై దాడుల చేశాయి. ఆ సమయంలో 9 నెలల కాలంలో దాదాపు 30 మంది పిల్లలను తోడేళ్లు చంపేశాయి. 1996 -97 సంవత్సరాలలో జరిగిన తోడేలు దాడులపై వైల్డ్ లైఫ్ సైంటిస్ట్, ఫారెస్ట్ ఆఫీసర్ అధ్యయనం చేయగా.. షాకింగ్ విషయాలు తెలిశాయి.

ఈ దాడులన్నీ ఒకే తోడేలు చేస్తోందని.. దాడి చేసిన ప్రతీసారి.. తదుపరి దాడి కోసం ఇతర గ్రామాలకు వెళ్లిపోతుందని తేలింది. అందువల్లే ఘటన జరిగిన ప్రాంతాల్లో ఎంత వెతికినా ఆ ప్రత్యేక తోడేలు కనిపించలేదని తెలిసింది. ఈ దాడులు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని జౌన్ పూర్, ప్రతాప్ గడ్, సుల్తాన్ పూర్ జిల్లాల్లో జరిగాయి. ఆ తోడేలు.. ఒంటరిగా ఉన్న మానవులపై ఒక్కసారి దాడి చేసి వారిని అడవిలోకి ఈడ్చుకెళుతుంది. ఆ తరువాత శవంలోని కొన్ని భాగాలు తీసుకెళ్లి తన గుంపులోని తోడేళ్లకు ఆహారంగా ఇస్తోందని పరిశోధనలో బయటపడింది.

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×