11 Killed, 10 Injured in Uttar Pradesh Road Accidents: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాజహాన్ పూర్ లోని అర్ధరాత్రి ఓ దాబా వద్ద ఆగి ఉన్న భక్తుల బస్సును అదుపు తప్పి ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం
Also Read: హైతీలో గ్యాంగ్ హింస.. యూఎస్ మిషనరీ జంట సహా.. మరో వ్యక్తి హత్య
వీరంతా పూర్ణగిరి టెంపుల్ కి వెళ్తున్నారు. ఈ ప్రమాద సమయంలో కొంత మంది బస్సులో ఉన్నారని, మరికొంత మంది దాబాలో భోజనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కు అదుపు తప్పి బస్సుపైకి దుసుకెళ్లిందన్నారు. దీనిపై కోసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.