Puja Khedkar: ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షాక్ ఇచ్చింది. నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించారని తేలడంతో యూపీఎస్సీ ఆమె ఐఏఎస్ సెలక్షన్ను రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆమెపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంతో పాటు భవిష్యత్తులో యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలో పాల్గొనకుండా డిబార్ చేసింది.
యూపీఎస్సీ కమిషన్ పూజా ఖేడ్కర్ వివాదంపై తొలిసారి స్పందించింది. యూపీఎస్సీ నిర్వహించిన విచారణలో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ -2022లో ఉత్తీర్ణత సాధించేందుకు పూజా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ గట్టెక్కేందుకు తన పేరుతో పాటు తల్లిదండ్రులు, ఫోటోలు, సంతకాలు, ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇంటి అడ్రస్తో పాటు ఇతర వివరాలకు సంబంధించి అన్ని ధృవీకరణ పత్రాలు అందించినట్లు తమ విచారణలో తేలిందని యూపీఎస్సీ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఓ నోట్ విడుదల చేసింది.
ఆ నోట్లో మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడినందుకు పూజా ఖేడ్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ షోకాజు నోటీసులు ఇచ్చినట్లు వివరించారు. అంతే కాకుండా ఆమె భవిష్యత్తులో యూపీఎస్సీ పరీక్ష రాయకుండా, అభ్యర్థిత్వాన్ని ప్రకటించకుండా డిబార్ చేసినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే పరీక్షల్లో మోసపూరితంగా వ్యవహరించిన పూజా ఖేడ్కర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఎఫ్ఐఆర్లో పోలీసులు ఆమెపై క్రిమినల్ కేసులు పెట్టినట్లు యూపీఎస్సీ వెల్లడించింది.
UPSC has, initiated a series of actions against her, including Criminal Prosecution by filing an FIR with the Police Authorities and has issued a Show Cause Notice (SCN) for cancellation of her candidature of the Civil Services Examination-2022/ debarment from future… pic.twitter.com/ho417v93Ek
— ANI (@ANI) July 19, 2024