Uddhav says Chandrababu joining INDIA bloc?: హస్తినలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈసారి ఎన్డీయేకి ఈసారి ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తోంది ఇండియా కూటమి. అందుకు తగ్గట్టుగా తెర వెనుక మంతనాలు సాగిస్తోంది. బుధవారం సాయంత్ర ఢిల్లీలో ఖర్గే అధ్యక్షతన ఇండియా కూటమి నేతలు సమావేశమవుతున్నారు.
మంగళవారం ఫలితాలు వెలువడిన తర్వాత ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు ఇండియా కూటమి నేతలు ఎన్డీయేలోని మిత్రులతో సంప్రదింపులు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని విషయాలు బయటపెట్టారు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే. బీజేపీ చేతిలో వేధింపులకు గురైన వారంతా తమతో వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ముఖ్యంగా చంద్రబాబును మోదీ సర్కార్ వేధించిందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు, నితీష్కుమార్తో మాట్లాడుతున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం బీజేపీకి 240 సీట్లలో విజయం సాధించింది. మిత్రులతో ఆ సంఖ్య 292కు చేరింది. అటు ఇండియా కూటమికి 235 స్థానాలు వచ్చాయి. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే అందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లు. చంద్రబాబు-జనసేన, నితీష్కుమార్ పార్టీలకు 30 సీట్లు వచ్చాయి. బీజేపీ తర్వాత ఎన్డీయేలో ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీల్లో టీడీపీ 16 సీట్లు రాగా, జేడీయూ 12 సీట్లు ఉన్నాయి.
ALSO READ: ప్రధాని పదవికి మోదీ రాజీనామా.. నెక్ట్స్ ఏంటి ?
ఎన్డీయేకు బాబు, నితీష్ దూరమైతే ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నమాట. సాయంత్రం ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి సమావేశం జరగనుంది. అందులోని తీసుకున్న నిర్ణయంపై తదుపరి అడుగులు వేయనుంది ఇండియా కూటమి. మొత్తానికి ఎప్పుడూ లేని విధంగా బీజేపీకి ఓటర్లు వెరైటీగా తీర్పు ఇచ్చారు.