Uddhav Thackeray | మహారాష్ట్రలో శివసేన పార్టీ గుర్తింపు వ్యవహారం అంత ఈజీగా తేలేలా లేదు. ఇటీవలే మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండ్ వర్గానికి అనుకూలంగా వచ్చింది. తాజాగా సోమవారం.. శివసేన మాజీ అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్థవ్ ఠాక్రే.. స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
Uddhav Thackeray | మహారాష్ట్రలో శివసేన పార్టీ గుర్తింపు వ్యవహారం అంత ఈజీగా తేలేలా లేదు. ఇటీవలే మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండ్ వర్గానికి అనుకూలంగా వచ్చింది. తాజాగా సోమవారం.. శివసేన మాజీ అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్థవ్ ఠాక్రే.. స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
పార్టీ నిబంధనల ప్రకారం.. ఏక్ నాథ్ షిండ్ వర్గం నాయకులదే అసలైన శివసేన అని జనవరి 10న స్పీకర్ రాహుల్ నార్వేకర్ ప్రకటించారు. అలాగే గతంలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏక్ నాథ్ షిండే వర్గంలో చేరిన శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కూడా నిబంధనల ప్రకారం చెల్లదని స్పీకర్ చెప్పారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి గట్టి షాక్ తగిలింది.
”షిండే వర్గం ఇచ్చిన ఆదేశాలపై అసెంబ్లీ స్పీకర్ తన నిర్ణ యం తీసుకున్నారు, తన నిర్ణయంతో స్పీకర్.. సుప్రీం కోర్టుని అవమానపరిచారు, ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారు,” అని ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు.
”స్పీకర్ తీసుకున్న నిర్ణయం సరైనదే అయితే పార్టీ నిబంధనల ప్రకారం.. మమల్ని సస్పెండ్ చేయాలి.. మరి అలా ఎందుకు జరగలేదు,” అని ఠాక్రే ప్రశ్నించారు. అందుకే స్పీకర్ నిర్ణయంపై స్టే విధించాలని ఆయన సుప్రీం కోర్టు పిటీషన్లో కోరారు.