Train Derail: రాజస్థాన్ లోని కోటాలో భోపాల్ కు వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైలులో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. ప్రమాదదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. రైలు నంబర్ 14813, జోధ్ పూర్- భోపాల్ ఎక్స్ ప్రెస్ రైలు కోట జంక్షన్ యార్డులో పట్టాలు తప్పగా.. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కోటా డివిజన్ లోని డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రయాణికుల కోసం అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లను విడుదల చేశారు.
బోగీలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియలేదు. ప్రమాదంలో ఎవరికీ హాని జరగలేదని తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని అధికారులు తెలిపారు. కాగా.. గతేడాది డిసెంబర్ లో రాజస్థాన్ లోని బికనీర్ జిల్లాలో ఖాళీ రైలు పట్టాలు తప్పింది. బికనీర్ లోని లాల్ ఘర్ రైల్వే స్టేషన్ లో జరిగింది.