EPAPER

Mysore: మైహర్‌లో అనుమానిత తట్టు కలకలం…ఇద్దరు చిన్నారులు మృతి

Mysore: మైహర్‌లో అనుమానిత తట్టు కలకలం…ఇద్దరు చిన్నారులు మృతి

Suspected Measles in Mysore: మధ్యప్రదేశ్‌లోని మైహర్‌లో చిన్నారులను వింత వ్యాధి వెంటాడుతుంది. వైద్య అధికారులు దీనిని తట్టు(measles)గా అనుమానిస్తున్నారు. ఈ వ్యాధితో ఇప్పటికే ఇద్దరు పిల్లలు మరణించారు. కాగా మరో 17 మంది చిన్నారులు వ్యాధి బారినపడి చికిత్స పొందుతున్నట్లు వైద్య అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లా అధికారులు ఎనిమిది గ్రామాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూడు రోజుల పాటు మూసివేసినట్లుగా తెలిపారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా వైద్య బృందాన్ని నియమించి, తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.


ఫిబ్రవరి 14, 16 తేదీల్లో ఇద్దరు పిల్లలు అనుమానాస్పద తట్టుతో మరణించారు. ఎనిమిది గ్రామాల్లోని మరో 17 మందికి ఈ వ్యాధి సోకినట్లు గుర్తించాము.” అని చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్(సీఎంహైచ్‌ఓ) ఎల్‌కే తివారీ తెలిపారు.

వ్యాధి ప్రభావితం ఉన్నటువంటి ఎనిమిది గ్రామాల్లోని అన్ని పాఠశాలలను మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలోని నివాసాలను సర్వే చేయాలని కోరినట్లు అధికారి తెలిపారు. బయట పిల్లలు గుమికూడటాన్ని కూడా ఆ జిల్లా కలెక్టర్ నిషేధించినట్లు సమాచారం.


వ్యాధి సోకినవారి నుంచి నమూనాలను సేకరించి పరీక్షల కోసం భోపాల్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌(ఏఐఐఎంఎస్‌)కు పంపామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)కు చెందిన వైద్యబృందం ప్రభావిత గ్రామాలను సందర్శించే అవకాశం ఉందని ఒక అధికారి వెల్లడించారు.

Tags

Related News

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Threat to Rahul Gandhi: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

Atishi Marlena Singh: ఒకప్పటి ఆంధ్రా స్కూల్ టీచర్ ఇప్పుడు ఢిల్లీ సిఎం.. ఆతిషి రాజకీయ ప్రస్థానం

Jammu Kashmir Elections: జమ్మూ‌కాశ్మీర్‌లో మొదలైన పోలింగ్.. ఓటర్లు క్యూ లైన్.. పదేళ్ల తర్వాత, పార్టీలకు పరీక్ష

Big Stories

×