Yoga Day : నేడు అంతర్జాతీయ యోగా డే నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. యోగాసనాలు వేస్తున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ నూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించే యోగా దినోత్సవంలో పాల్గొంటారు.
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో గంటపాటు యోగా కార్యక్రమం జరుగుతుంది . ఐక్యరాజ్య సమితి అత్యున్నత అధికారులు, పలు దేశాల రాయబారులు, ప్రముఖులు యోగ ఆసనాలు వేయనున్నారు. జూన్ 21 తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2014లో ప్రకటించారు. అప్పటి నుంచి ఈ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి.
భారత్ బహూకరించిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని గత ఏడాది డిసెంబర్ లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేశారు. గాంధీకి ప్రధాని మోదీ నివాళులర్పించిన తర్వాత యోగా కార్యక్రమం ప్రారంభమవుతుంది.180 దేశాలకు చెందిన ప్రతినిధులు యోగా దినోత్సవంలో పాల్గొంటారు.
పలు దేశాల రాయబారులు, కళాకారులు, విద్యావేత్తలు, పారిశ్రామిక వేత్తలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. మోదీతో కలిసి యోగా దినోత్సవంలో పాల్గొనడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 77వ సెషన్ అధ్యక్షుడు సాబా కొరొసి ట్వీట్ చేశారు.