West Bengal : సంక్రాంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ కు చెందిన ముగ్గురు సాధువులు పశ్చిమ బెంగాల్ లోని గంగాసాగర్ మేళాకు బయలుదేరారు. మార్గ మధ్యలో పురిలియా జిల్లాలో వాహనం ఆపి ఇద్దరు అమ్మాయిలను గంగాసాగర్కు దారి అడిగారు. సాధువులను చూడగానే ఆ ఇద్దరు అమ్మాయిలు భయాందోళనకు గురి అయ్యారు. దీంతో చుట్టుపక్కల వారు సాధువులను కిడ్నాపర్లుగా భావించారు. ముకమ్మడిగా ముగ్గురు సాధువులపై దాడి చేశారు.
West Bengal : సంక్రాంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్కు చెందిన ముగ్గురు సాధువులు పశ్చిమ బెంగాల్లో గంగాసాగర్ మేళాకు బయలుదేరారు. మార్గ మధ్యలో పురిలియా జిల్లాలో వాహనం ఆపి ఇద్దరు అమ్మాయిలను గంగాసాగర్కు దారి అడిగారు. సాధువులను చూడగానే ఆ ఇద్దరు అమ్మాయిలు భయాందోళనకు గురైయ్యారు. దీంతో చుట్టుపక్కల వారు సాధువులను కిడ్నాపర్లుగా భావించారు. మూకుమ్మడిగా సాధువులపై దాడి చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. సాధువులను రక్షించారు. తర్వాత పోలీసు స్టేషన్కు తీసుకువెళ్లి సాధువులను విచారించారు. వారు కిడ్నాపర్లు కాదని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సాధువులపై దాడి చేసిన 12 మందిని అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై రాజకీయం దుమారం చెలరేగింది. గంగాసాగర్కు వెళ్తున్న సాధువులపై దాడి జరగడానికి టీఎంసీ నేతలే కారణమని బీజేపీ నాయకులు ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై రాష్ట్రముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించకపోవడం సిగ్గు చేటని బీజేపీ నేతలు విమర్శించారు.