Three Maoist killed in Chhattisgarh encounter: ఛత్తీస్గడ్లో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
నారాయణపూర్ జిల్లా కాంకేర్ సరిహద్దుల్లోని అబూజ్మడ్లోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. గురువారం ఉదయం నుంచి పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.