EPAPER

Mother Protest for Lover & Husband: ముగ్గురు పిల్లల తల్లి భాగోతం.. భర్త, లవర్ ఇద్దరూ కావాలని ధర్నా.. విద్యుత్‌ స్తంభం ఎక్కి మరీ!

Mother Protest for Lover & Husband: ముగ్గురు పిల్లల తల్లి భాగోతం.. భర్త, లవర్ ఇద్దరూ కావాలని ధర్నా.. విద్యుత్‌ స్తంభం ఎక్కి మరీ!
Mother Protest
Mother Protest

3 Kids Mother Protest for Lover and Husband: ప్రస్తుత కాలంలో అక్రమ సంబంధాల ఘటనలు పెరిగిపోతున్నాయి. తరచూ ఏదో ఒక ఘటన వార్తల్లో నిలుస్తూనే ఉంది. భార్యను భర్త మోసం చేయడం, భర్తను భార్య మోసం చేయడం వంటి ఘటనలతో కాపురాలు కూలిపోతున్నాయి. తాజాగా ఇటువంటిదే ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో రహస్యంగా సంబంధం నడిపిస్తుంది ఓ ముగ్గురు పిల్లల తల్లి. భర్త గురించి, పిల్లల గురించి ఆలోచించకుండా ప్రియుడి కోసం ప్రాణాలు తీసుకునే దాకా వెళ్లింది. తనకు భర్తతో పాటు ప్రియుడు కూడా కావాలని, అందరం కలిసి ఒకే ఇంట్లో ఉందాం అంటూ పట్టుబట్టింది. దీనికి భర్త అంగీకరించలేదు. ఇక మొండిపట్టు పట్టిన ఆ మహిళ కరెంటు స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో వెలుగుచూసింది.


గోరఖ్‌పూర్‌ పిప్రాయిచ్‌‌కు చెందిన ముగ్గురు పిల్లల తల్లి సుమన్ దేవి అనే మహిళలకు ఓ వ్యక్తితో పెళ్లి అయింది. ఇద్దరికీ కలిపి ముగ్గురు పిల్లల సంతానం ఉండగా.. సుమన్ దేవి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. దాదాపు ఏడేళ్లుగా ఈ సంబంధాన్ని కొనసాగిస్తూ వస్తుంది. ఈ విషయం దేవి భర్తకు తెలియడంతో ఇంట్లో గొడవకు దారి తీసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా.. ప్రియుడితోనే కలిసి ఉంటానని, తమ ఇంట్లోనే ఉందాం అంటూ భర్తతో గొడవ పడింది. దీనికి భర్త అంగీకరించకపోవడంతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. కరెంటు పోలు ఎక్కి నిరసన తెలిపింది. వెంటనే గ్రామస్థులు ఘటన స్థలానికి చేరుకుని విద్యుత్ శాఖకు ఫోన్ చేసి కరెంటు నిలిపివేయించారు.

Also Read: డ్రైవర్ లేకుండా మెట్రో రైలు పరుగులు.. ఎక్కడో తెలుసా?


వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని దేవిని కిందకు దించారు. అనంతరం దేవి భర్త పోలీసులకు జరిగిన విషయం చెప్పడంతో కేసు నమోదు చేశారు. కాగా, నెల రోజుల క్రితం కూడా దేవి రెండు సార్లు ఆత్మహత్యకు పాల్పడినట్లు భర్త పోలీసులకు తెలిపాడు. ఒకసారి 5వ అంతస్తు నుంచి దూకేందుకు ప్రయత్నించగా.. మరోసారి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లిందని తెలిపాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Tags

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుస రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×