Wrestlers : బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్పై చర్యలు తీసుకోవాలంటూ పోరాటం చేస్తున్న రెజ్లర్లను మరోసారి కేంద్రం చర్చలకు ఆహ్వానించింది. ఇటీవల అమిత్ షా వారితో మాట్లాడారు. ఆ తర్వాత నుంచి కీలక పరిణామాలు జరిగాయి. స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ రైల్వేలో తిరిగి విధుల్లో చేరారు. అమిత్ షాతో భేటీ జరిగిన రెండు రోజులకే రెజ్లర్లు విధులు చేరడంతో ఉద్యమం ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి.
ఈ ఇష్యూపై స్పందించిన సాక్షిక్ మాలిక్ పోరాటం ఆపేదని లేదని స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం విధుల్లో చేరినా ఆందోళన కొనసాగుతుందని తేల్చిచెప్పారు. అమిత్ షాతో భేటీపై బజరంగ్ పునియా మాట్లాడారు. కేంద్రమంత్రితో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదన్నారు. ఈ ఉద్యమం ఆగదని ప్రకటించారు. ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై వ్యూహరచన చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించలేదని మండిపడ్డారు. ప్రభుత్వ స్పందనతో తాము సంతృప్తిగా లేమని పునియా తేల్చిచెప్పారు.
బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలని రెజ్లర్లు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ రంగంలోకి దిగారు. వారితో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ట్వీట్ చేశారు.
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ విజ్ఞప్తిపై రెజ్లర్లు స్పందించారు. తమ పోరాటాన్ని ఆపేది లేదన్నారు. బ్రిజ్ భూషణ్ను అరెస్ట్ చేయాలన్నదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. కేంద్రం విజ్ఞప్తిపై కాప్ పంచాయత్లో చర్చిస్తామన్నారు. రూమ్ల్లో కాదు.. బహిరంగంగా చర్చించాలని రెజ్లర్ల కోరుతున్నారు.