Paneer curry: పెళ్లిల్లలో భోజనాలు వద్ద గొడవలు జరగడం కామన్. భోజనాలు బాగోలేవనో, మర్యాదలు చేయలేదనో వధూవరుల బంధువుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. అయితే ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్లో పెళ్లి విందులో పనీరు కర్రీ పెట్టలేదని ఇరు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. అదికాస్త బెల్తులతో కొట్టుకునే వరకు వెళ్లింది.
ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి అయ్యాక భోజనాలు జరుగుతుండగా.. వరుడి బంధువు ఒకరు పనీరు కర్రీ పెట్టలేదని వధువు తండ్రిని నిలదీశాడు. దీంతో వివాదం చోటుచేసుకుంది. అదికాస్త పెద్దదిగా మారి ఇరువర్గాల వారు బెల్టులు, కర్రలతో కొట్టుకున్నారు. కొందరికి గాయాలు కూడా అయ్యాయి. అయితే స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకొని గొడవను అడ్డుకున్నారు. ఇరువర్గాలకు సర్ధిచెప్పడంతో గొడవ సద్దు మణిగింది.