Army Defuses Bombs: మణిపూర్లో రోడ్డుపై అమర్చిన బాంబులను ఆర్మీ జవాన్లు గుర్తించారు. వెంటనే ఆ ప్రాంతంలో రాకపోకలను నిలిపివేసారు. వెంటనే బాంబు స్క్వాడ్ కు సమాచారం అందించగా అక్కడకు వచ్చిన స్క్వాడ్ బాంబులను నిర్వీర్యం చేశారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని నోంగ్ డామ్, ఇథమ్ గ్రామాలను కలిపే రహదారిపై ఐఈడీలను అమర్చగా ఆర్మీ సిబ్బంది ఆదివారం వాటిని గుర్తించారు.
ఆర్మీ జవాన్లు తనిఖీలు నిర్వహిస్తుండగా రోడ్డుపై అమర్చిన 3 ఐఈడీలను గుర్తించినట్లు ఆర్మీ అధికారి తెలిపారు. ఇథమ్, నోండ్ డామ్ గ్రామాల సమీపంలో బాంబులు అమర్చినట్లు తెలిపారు. బాంబు స్క్వాడ్ సహాయంతో రోడ్డుపై అమర్చిన ఐఈడీలను నిర్వీర్యం చేసినట్లు వెల్లడించారు. సకాలంలో స్పందించడం వల్ల ప్రాణ నష్టం జరగకుండా నిరోధించామని వెల్లడించారు.
“రొటీన్ ఏరియా-డామినేషన్ ,నిఘా ఆపరేషన్ సమయంలో, ఆర్మీ సిబ్బంది మూడు IEDలను రహదారి వెంట ఉంచడాన్ని గమనించారు. ఆర్మీ సిబ్బంధి వేగంగా పనిచేసి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది” అని రక్షణ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.
Also Read: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి
జాతి హింస, ఆధిపత్య తెగల మధ్య ఘర్షణలు చెలరేగిన ఒక సంవత్సరం తర్వాత కూడా మణిపూర్ లో ఇంకా సాధారణ పరిస్థితి నెలకొనడం లేదు. దీంతో రెండు గ్రామాలు కలిసే సున్నిత ప్రాంతాలపై, ప్రత్యేకించి రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లోయ చుట్టుపక్కల ఉన్న పర్వత ప్రాంతాలపై భద్రతా దళాలు నిఘా ఉంచాయి.