Election Commission registers Tamilaga Vettri Kazhagam: తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్కి కేంద్ర ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. దళపతి విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ను ఎన్నికల కమిషన్ అధికారికంగా గుర్తించింది. ఈ విషయాన్ని టీవీకే పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం నిర్ణయంపై విజయ్తో పాటు ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
‘తమిళగ వెట్రి కళగం‘ను రాజకీయ పార్టీగా నమోదు చేయాలని మేము గత ఫిబ్రవరి 2వ తేదీన భారత ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నాము. మన దేశ ఎన్నికల సంఘం దీనిని చట్టబద్ధంగా పరిగణించి ఇప్పుడు మన పార్టీని రాజకీయ పార్టీగా నమోదు చేసి, రిజిస్టర్డ్ పార్టీగా ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనేందుకు అనుమతించింది. దీన్ని మీకు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని విజయ్ చెప్పారు.
కాగా, 2026 ఎన్నికల లక్ష్యంగా తాను తన పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మంచి విజయ్ పై ప్రజల్లో సానుకూలత కనిపిస్తోంది. అంతకుముందు నిర్వహించిన సమావేశంలో విజయ్ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకున్నారు.
రాజకీయ ప్రయాణంలో అనేక సమస్యలు ఎదురవుతాయని, ఎన్ని విమర్శలు ఎదురైన చిరునవ్వుతో ఎదుర్కోవాలని విజయ్ చెప్పారు. ఎవరిపైనా పోరాటం చేయాల్సిన అవసరం లేదని, ప్రజా సమస్యలపైనే పోరాటం చేయాలని విజయ్ చెప్పిన మాటలు ఇంకా ప్రజల్లో ఉండడం విశేషం. తన పొలిటికల్ పార్టీ దేనికోసం పనిచేయాలనే క్లారిటీ విజయ్ కి ఉండడంతో రెస్పాన్స్ బాగా వస్తోంది.
Also Read: కోల్ కతా డాక్టర్ కేసులో కీలక ఆధారాలు లభ్యం..ఆ రాత్రి బాత్ రూమ్ లో స్నానం చేసిందెవరు?
ఇదిలా ఉండగా, చెన్నై శివారు పనైయూర్లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయ్ జెండాను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ జెండాలో పైన, కింది భాగంలో ఎరుపు, మధ్యలో పసుపు రంగులు ఉన్నాయి. మధ్యలో ఎరుపురంగు వృత్తాకారం లోపల శిరీష పుష్పం, చుట్టూ నక్షత్రాలు ఉన్నాయి. ఇందులో ఐదు నీలం, మిగతావి పచ్చ రంగులో ఉన్నాయి. శిరీష పుష్పానికి రెండు వైపులా ఘీంకరించే ఏనుగు రూపాలు ఉన్నాయి.