Mumbai Murder: మహారాష్ట్రలో ఓ మహిళ అత్యంత కిరాతకంగా హత్యకు గురైంది. సహజీవన చేస్తున్న వ్యక్తే ఆమెను హత్య చేసి శరీరాన్ని.. ట్రీ కట్టర్ తో ముక్కలు, ముక్కలుగా నరికి వేశాడు. ఆమె వేళ్లను ప్రెషర్ కుక్కర్ లో ఉడికించాడు.
ముంబైలోని మీరా భయందర్ ప్రాంతంలో 36ఏళ్ల సరస్వతి వైద్య.. తనకన్న ఇరవై ఏళ్లు పెద్దవాడైన మనోజ్ సహానీతో మూడేళ్లగా సహజీవనం చేస్తోంది. ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలతో మనోజ్ సహానీ.. సరస్వతి వైద్యను కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నాలుగు రోజుల క్రితం హత్య చేసి.. శరీరాన్ని ముక్కలు చేశాడు. అనంతరం చేతి వేళ్లను కత్తిరించిన ప్రెషర్ కుక్కర్ లో ఉడుకబెట్టాడు. వీరు నివసిస్తున్న ప్లాట్ లోంచి దుర్వాసన రావడంతో స్థానికులు నయా నగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సరస్వతి శరీర భాగాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి.. మనోజ్ సహానీని అదుపులోకి తీసుకున్నారు.
మనోజ్ సహానీ బోరివాలీ ప్రాంతంలో ఒక షాప్ నడుపుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఇక హత్యకు గురైన సరస్వతి వైదను అనాథగా పోలీసులు గుర్తించారు.