EPAPER

Ayodhya : అయోధ్య అంతా ఆధ్యాత్మిక శోభ.. 10 లక్షల దీపాలతో అలంకరణ..!

Ayodhya : అయోధ్య అంతా ఆధ్యాత్మిక శోభ.. 10 లక్షల దీపాలతో అలంకరణ..!

Ayodhya : శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని అయోధ్య నగరం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పది లక్షల దీపాలతో అలంకరించనున్నట్లు రామజన్మభూమి ట్రస్టు సభ్యులు తెలిపారు. అందుకోసం దేశీయంగా తయారు చేసిన మట్టి ప్రమిదలనే వినియోగించనున్నట్లు ప్రకటించారు. అయోధ్యలోని ముఖ్యనగరాలు అయిన రామ మందిరం సహా రామ్‌ కీ పైడీ, సరయు ఘాట్‌, కనక్‌ భవన్‌, గుప్తర్‌ ఘాట్‌, మనిరామ్‌ దాస్‌ చవానీ, లతా మంగేష్కర్‌ చౌక్‌ వంటి ప్రముఖ ప్రదేశాలన్నింటినీ దీపాలతో అలంకరిస్తామని వెల్లడించారు.


శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సోమవారం సాయంత్రం తమ ఇళ్లు, దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో దీపాలు వెలిగించాలని ఇప్పటికే ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అయోధ్యలో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం గత ఏడేళ్లుగా దీపోత్సవం నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2017లో 1.71 లక్షల దీపాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2023లో రికార్డు స్థాయిలో అది 22.23 లక్షలకు చేరింది. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా జనవరి 22న ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

.


.

Tags

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×