Tamilnadu Honour Killings : టెక్నాలజీలో అంతరిక్షాన్ని తాకుతున్నా కొన్ని నమకాలు పాతాళానికి తోసేస్తున్నాయి. దేశంలో పరువు హత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఇలాంటి ఓ దారుణం చోటుచేసుకుంది. వేరే కులం యువకుడిని పెళ్లిచేసుకుందని కన్నతల్లి ఆరుముగకని..కూతరు అరుణను దారుణంగా హత్య చేసింది.
మృతురాలు అరుణ కోయంబత్తూర్లో నర్సింగ్ చదువుతోంది. అక్కడే ఓ యువకుడితో ప్రేమలో పడింది. అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని ఇంట్లో తల్లితండ్రులకు చెప్పింది. మంగళవారం తల్లి అరుముగకని కూతురు అరుణను ఇంటికి రమ్మని పిలిచింది. తమ కులంలోని యువకుడితో పెళ్లి సంబంధం చూసామని.. అతన్నే పెళ్లి చేసుకోమని తల్లి కూతురిని మందలించింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య మంగళవారం రాత్రి పెద్ద గొడవ జరిగింది. ఈ క్రమంలో కూతురు అరుణను కత్తితో గొంతు కోసి హత్య చేసింది అరుముగకని. అనంతరం తాను ఆత్మహత్యకు యత్నించింది. మృతురాలి తండ్రి, సోదరుడు చెన్నైలో ఉద్యోగం చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న అరుణముకనిని పోలీసులు అరెస్ట్ చేశారు.