Tamil Nadu | తమిళనాడులో ఈడీ అధికారులకు, విజిలెన్స్ అవినిరోధక శాఖ మధ్య వార్ నడుస్తోంది. తాజాగా ఈడీ అధికారులపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల అంకిత్ తివారీ అనే ఒక ఈడీ అధికారి రూ.20 లక్షలు లంచం తీసుకుంటుండగా.. DVAC (Department of Vigilance and Anti corruption)అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Tamil Nadu | తమిళనాడులో ఈడీ అధికారులకు, విజిలెన్స్ అవినిరోధక శాఖ మధ్య వార్ నడుస్తోంది. తాజాగా ఈడీ అధికారులపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల అంకిత్ తివారీ అనే ఒక ఈడీ అధికారి రూ.20 లక్షలు లంచం తీసుకుంటుండగా.. DVAC (Department of Vigilance and Anti corruption)అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఈ కేసులో విచారణ కోసం విజిలెన్స్ అధికారులు తనిఖీల నిమిత్తం ఈడీ(Enforcement Directorate) ఆఫీసుకి వెళ్లారు. అయితే అక్కడ సోదాల చేయకుండా ఈడీ అధికారులు విజెలెన్స్ అధికారులను అడ్డుకున్నారు. దీంతో విధులకు ఆటకం కలిగించారంటూ విజిలెన్స్ అధికారులు తమిళనాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితంగా పోలీసులు ఈడీ అధికారులపై కేసు నమోదు చేశారు.
ఇటీవల అంకిత్ తివారీ అనే ఈడీ అధికారి ఒక ప్రభుత్వ డాక్టర్ను ఒక కేసులో నుంచి తప్పించడానికి రూ.3 కోటలు డిమాండ్ చేశాడు. కానీ ఆ డాక్టర్ రూ.51 లక్షలకు బేరమాడి రూ.20 లక్షలు లంచం ఇవ్వబోతుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.
Tamil Nadu police, booked, corruption, ED officer, Ankit Tiwari, Vigilance department, Anti Corruption,