Surath Marriage : గుజరాత్ లోని సరయూ నది తీరం చక్కటి కార్యక్రమానికి వేదికైంది. సింగిల్ పేరంట్ ఉన్న మూడు వందల మంది మహిళల వివాహ కార్యక్రమం అంగరంగవైభవంగా జరిగింది. ఇందులో ముగ్గురు ముస్లింలు, ఇద్దరు క్రిస్టియన్లు కాగా.. మిగతా వారు హిందువులు.
వీరంతా వారి వారి ఆచారాల ప్రకారం నచ్చిన వ్యక్తులను మనువాడారు. ఈ సాముహిక వివాహాలను పీపీ సావనీ గ్రూప్ 2012 నుంచి నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పటివరకు 4వేల 572 మంది మహిళలకు వివాహం జరిపించారు. 300 జంటలు వేదికపై చేరడంతో నూతన శోభ సంతరించుకుంది.
కేవలం పెళ్లి అంటే అమ్మాయికో చీర, పూజా సామాగ్రిని మాత్రమే కొనుగోలు చేసి ఇవ్వరు. ఇంటిసామాగ్రి, ఫర్నీచర్, నగలు అన్నింటి ఖర్చు కూడా సావనీ గ్రూపే భరిస్తుంది. సూరత్ లో సావనీ గ్రూప్ రియల్ ఎస్టేట్, వజ్రాల వ్యాపారంతో పాటు విద్యాసంస్థలను నడుపుతుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు స్థానికులు పెద్దసంఖ్యలో తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.