EPAPER

Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. కేజ్రీవాల్ బెయిల్ పై నేడే సుప్రీం కోర్టు తీర్పు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తన అరెస్టుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం, జూలై 12న తీర్పు వెలువరించనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్ ఈ తీర్పు వెలువరిస్తుందని.. కోర్టు వెబ్ సైట్ పై ప్రకటన చేయబడింది.

Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. కేజ్రీవాల్ బెయిల్ పై నేడే సుప్రీం కోర్టు తీర్పు

Arvind Kejriwal | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తన అరెస్టుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం, జూలై 12న తీర్పు వెలువరించనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్ ఈ తీర్పు వెలువరిస్తుందని.. కోర్టు వెబ్ సైట్ పై ప్రకటన చేయబడింది.


ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆధారాలున్నాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను మార్చి 21, 2024న అరెస్టు చేసింది. అయితే తనను ఈడీ అరెస్టు చేయడం.. చట్ట వ్యతిరేకమని చెబుతూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశారు. కానీ హైకోర్టు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వెలువరించడంతో.. కేజ్రీవాల్.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. ఏప్రిల్ 9, 2024న సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు.

ఈ కేసులో ఇరు పక్షాల వాదన విన్న తరువాత మే 17, 2024న జస్టిస్ దిపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.


Also Read: మాజీ అగ్నివీర్ జవాన్లకు పారామిలిటరీ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్!

మరోవైపు కేజ్రీవాల్ ఈ కేసులో బెయిల్ కోరుతూ ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. జూన్ 20, 2024న ట్రయల్ కోర్టు లక్ష రూపాయల పూచీకత్తుపై కేజ్రీవాల్ కు బెయిల్ ముంజూరు చేసింది. కానీ కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడంపై ఈడీ అధికారులు మరుసటి రోజే ఢిల్లీ హైకోర్టులో ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేశారు.

జూన్ 25న కేజ్రీవాల్ కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించడంతో ఆయన ఇప్పటికీ కస్టడీలోనే ఉన్నారు.

Also Read:  జైలులో నటుడు దర్శన్‌కు కష్టాలు, పవిత్రగౌడ కంటతడి..

ఆ తరువాత సిబిఐ అధికారులు.. కేజ్రీవాల్ ను జూన్ 26న ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవినీతి ఆరోపణలు చేస్తూ.. తమ కస్టడీలోకి తీసుకున్నారు.

ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులు మనీష్ సిసోదియా, సత్యేంద్ర జైన్ , ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 2021-22లో రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు. కానీ ఈ పాలసీ ద్వారా కేజ్రీవాల్, ఇతర మంత్రులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ఢిల్లీ గవర్నర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×