Supreme Court (latest telugu news): కొత్త ఎలక్షన్ కమినర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కొత్త ఈసీ నియామకంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందుకు వారి నియామకాన్ని నిలిపివేస్తే గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయని తెలిపింది.
ఇటీవల కొత్త ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేశ్ కుమార్ , సుఖ్బీర్ సింగ్ ను కేంద్రం నియమించింది. ఈసీల నియామకంపై కేంద్ర తీసుకొచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది.
కొత్తగా ఎన్నికల కమిషనర్లుగా నియమితులైన జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ పై ఎలాంటి ఆరోపణలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎలక్షన్ కమిషన్ ను స్వతంత్ర సంస్థ అని తేల్చిచెప్పింది. ఈసీల నియామకం కోసం కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన యాక్ట్ ను తప్పుపట్టలేమని పేర్కొంది.
Also Read: నేడు అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణ .. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఢిల్లీ సీఎం..
సార్వత్రిక ఎన్నికల ముందు ఖాళీ అయిన రెండు ఈసీ పోస్టులను కేంద్రం భర్తీ చేసింది. ఇటీవల అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం ఈ నియామకాలు చేపట్టింది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందుకు ప్రక్రియ జరిగింది. కొత్త చట్టం అమలును సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై గురువారం విచారణ జరిగింది.