EPAPER

Kerala : రేపు కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు.. గతేడాది కంటే ఆలస్యం..

Kerala : రేపు కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు.. గతేడాది కంటే ఆలస్యం..

Kerala : నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు దేశంలోకి ప్రవేశించనున్నాయి. శుక్రవారానికల్లా కేరళలో ప్రవేశించే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ ప్రకటించింది. రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దక్షిణ అరేబియా సముద్రం మీదుగా పడమట గాలులు వీస్తున్నాయి.


గతేడాది జూన్‌ ఒకటినే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. కానీ ఈ ఏడాది వారం రోజులపైగా ఆలస్యంగా వస్తున్నాయి. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను తీవ్రరూపం దాలుస్తోంది. ఇది జూన్‌ 5న ఏర్పడింది. బుధవారం నాటికి తీవ్ర తుపానుగా మారిందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. తుపాను ప్రభావంతో దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించడానికి అనుకూల వాతావరణం ఏర్పడిందని అంచనా వేస్తున్నారు.

రుతుపవనాలు కేరళలో ప్రవేశించిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించనున్నాయి. అరేబియా సముద్రం, లక్షద్వీప్, మాల్దీవులు, కొమరిన్‌ ప్రాంతాలు, నైరుతి, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి ప్రవేశానికి అనుకూల పరిస్థితులున్నాయని ఐఎండీ తెలిపింది.


Related News

Amethi Family Murder: అమేఠీలో కుటుంబాన్ని హత్య చేసిన సైకో.. హత్యకు ముందే పోలీసులకు సమాచారం… అయినా..

Haryana Elections: హర్యానాలో పోలింగ్ మొదలు.. ఆ పార్టీల మధ్యే ప్రధాన పోటీ, ఫలితాలు ఎప్పుడంటే?

Toilet Tax: ఆ రాష్ట్రంలో టాయిలెట్ ట్యాక్స్ అమలు.. ఇది చెత్త పన్ను కంటే చెత్త నిర్ణయం!

Gurmeet Ram Rahim: ‘ధనవంతులకో న్యాయం.. పేదవారికో న్యాయం’.. 2 సంవత్సరాలలో రేపిస్టు డేరా బాబాకు 10 సార్లు పెరోల్

Viral Video: సెక్రటేరియట్ మూడో అంతస్తు నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్.. ఎమ్మెల్యేలు, ఎందుకో తెలుసా?

Chhattisgarh Encounter: మావోలకు షాక్, చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్.. 36 మంది మృతి, తప్పించుకున్న అగ్రనేతలు?

Spam Call Death : ‘మీ కూతురు వ్యభిచారం చేస్తోంది’.. సైబర్ మోసగాళ్లు చెప్పిన అబద్ధం విని చనిపోయిన టీచర్..

Big Stories

×