SIA Raids : జమ్మూ కాశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (SIA) బుధవారం తెల్లవారుజామున కాశ్మీర్, న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసింది. టెర్రర్ ఫండింగ్ కేసులో SIA.. కాశ్మీర్, న్యూఢిల్లీ, శ్రీనగర్, అనంత్నాగ్, పుల్వామాలోని డజన్ల కొద్దీ ప్రదేశాలలో దాడులు నిర్వహిస్తోందని ఒక ఉన్నత అధికారి తెలిపారు. ప్రత్యేక కోర్టు జారీ చేసిన సెర్చ్ వారెంట్ల ప్రకారం ఈ సోదాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఎఫ్ఐఆర్ నంబర్ 08,2023 ను బేస్ చేస్కొని దాడులు జరుగుతున్నాయని అధికారి తెలిపారు.
సోదాల సమయంలో, అనుమానితుల ప్రాంగణంలో వివిధ నేరారోపణ పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని.. కేసు వివరాలను తరువాత వెల్లడిస్తామని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ టెర్రర్ ఫండింగ్ కేసులో కొంతమంది ప్రముఖ వ్యక్తులకు సంబంధాలు ఉండవచ్చని వారు విశ్వసించారు. ఈ వ్యక్తుల పేర్లు గోప్యంగా ఉన్నప్పటికీ, వారు SIA రాడార్లో ఉన్నట్లు నివేదించారు.