Shraddha Murder Case Update : శ్రద్ధా వాకర్ మర్డర్ కేసులో రోజుకో విషయం బయటకు వస్తుంది. నిందితుడు అఫ్తాబ్ చాలా పకట్బందీగా హత్య చేసినట్లు దర్యాప్తులో తేలుతోంది. హత్య తరువాత శ్రద్ధా ఫోన్ను అఫ్తాబ్ కొన్ని నెలల వరకు ఉపయోగించినట్లు పోలీసులు కనుగ్గొన్నారు. శ్రద్ధా కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో అఫ్తాబ్ను పిలిచి విచారించినప్పుడు.. శ్రద్ధా ఫోన్ అఫ్తాబ్ దగ్గరే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
నవంబర్ 3న అఫ్తాబ్ తొలిసారి శ్రద్ధా కేసు విషయమై పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. ఆ తరువాత ముంబయి నుంచి ఢిల్లీ వెళ్తున్నప్పుడు.. శ్రద్ధా సాక్ష్యాలు దొరక్కుండా ఫోన్ను సముద్రంలో విసిరేసాడు. ఇలా ఎన్నో సాక్ష్యాలను అఫ్తాబ్ సముద్రంలో విసిరేసినట్లు పాలిగ్రాఫ్ టెస్ట్లో చెప్పాడు. ఇదే విషయాన్ని నార్కో టెస్ట్లో కూడా చెప్పాడు. అఫ్తాబ్ చెప్పిన సమాధానాలు నార్కో, పాలిగ్రాఫ్ టెస్టుల్లో నిజమని తేలుతున్నా.. ఈ పరీక్షలను చాకచక్యంగా ఎదుర్కోవడానికి అఫ్తాబ్ ముందుగానే సిద్ధమయి ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.