EC Alloted Party Symbol to Sharad Pawar NCP: శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం కొత్త గుర్తును గురువారం కేటాయించింది. ఎన్సీపీలోని శరద్ పవార్ వర్గానికి “మ్యాన్ బ్లోయింగ్ తుర్హా” గుర్తును కేటాయించారు.
“వారి అభ్యర్థన మేరకు, మహారాష్ట్రలోని అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలలో “మ్యాన్ బ్లోయింగ్ తుర్హా” గ్రూప్/పార్టీకి కేటాయించాం” అని ఎన్నికల సంఘం తన ప్రకటనలో తెలిపింది.
ఫిబ్రవరి 6న కేంద్ర ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గానికి ఎన్సీపీ గుర్తు ‘వాల్ క్లాక్’ను కేటాయించింది. దీంతో ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Read More: ‘పార్టీ గుర్తు కాదు.. సిద్ధాంతాలు ముఖ్యం’.. ఎన్నికల కమిషన్పై మండిపడిన షరద్ పవార్
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ శరద్ పవార్పై తిరుగుబాటు చేసి మహారాష్ట్రలోని అధికార బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరిన తర్వాత, 2023 జూలై నుంచి మామ, మేనల్లుడు మధ్య దూరం పెరిగింది. ఇది ఎన్సీపీలో చీలికకు కారణమైంది.
ఫిబ్రవరి 21న అజిత్ పవార్ నేతృత్వంలోని పార్టీ అనర్హత పిటిషన్పై బాంబే హైకోర్టు ఎన్సీపీలోని శరద్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు, మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 14న కోర్టు వాయిదా వేసింది.
శరద్ పవార్ వర్గానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించకుండా స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ చీఫ్ విప్ అనిల్ భాయిదాస్ పాటిల్ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఇటీవలి ఉత్తర్వులను రద్దు చేయాలని, అది చట్టపరంగా లోపభూయిష్టంగా ప్రకటించాలని, మొత్తం 10 మంది శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించాలని పాటిల్ కోర్టును అభ్యర్థించారు.