Several People dead in Stampede: తమిళనాడలో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట చోటు చేసుకుని పలువురు మృతిచెందారు. చెన్నైలోని మెరీనా బీచ్ లో ఆదివారం ఎయిర్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. లక్షలాదిగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగి విషాదం చోటు చేసుకుంది. ఎయిర్ షో ముగిసిన తరువాత ప్రజలు అక్కడి నుంచి తరలివెళ్తున్న క్రమంలో రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగి నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. వందలాదిమందికి గాయాలైనట్లు సమాచారం. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఊహించినదాని కంటే అధికంగా ప్రజలు ఎయిర్ షోకు తరలి రావడంతో ఈ విషాదం చోటు చేసుకున్నదని చెబుతున్నారు. భారీగా జనం తరలిరావడంతో పోలీసులు కూడా చేతులెత్తేశారని అంటున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని పేర్కొంటున్నారు.
Also Read: 6 వేల మీటర్ల ఎత్తులో 3 రోజులు అరిగోస, IAF సాయంతో ప్రాణాలతో బయటపడ్డ విదేశీ పర్వతారోహకులు