Delhi : ఉత్తర భారత దేశాన్ని పొగ మంచు కమ్మేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. రాజధాని నగరంలో దట్టంగా పొగమంచు కమ్మేయడంతో.. రవాణా వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దాదాపు 100 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు రైళ్లను రద్దు చేశారు అధికారులు.
రెండు వారాల తర్వాత ఇవాళ స్కూల్స్ తెరుచుకోవాల్సి ఉంది. చలి కారణంగా స్కూల్స్ టైమింగ్స్లో మార్పులు చేశారు అధికారులు. ఇటు వాయు కాలుష్యానికి పొగమంచు తోడవ్వడంతో జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. పొగమంచు విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది. సోమవారం ఉదయం దాదాపు వంద విమాన సర్వీసులు రద్దు కాగా.. మరో 128 సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో సంయమనం పాటించాలని ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు సూచించారు. మరోవైపు రాజధాని నుంచి వెళ్లే 18 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
దేశ రాజధాని ఎన్సీఆర్ (NCR) ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్ దిగువన నమోదయ్యాయి. శుక్రవారం అది రికార్డు స్థాయిలో 3.9 డిగ్రీల సెల్సియస్గా.. శనివారం ఏకంగా 3 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది. మరోవైపు వాయు కాలుష్యం పెరగడంతో నగరవాసుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఢిల్లీ-ఎన్సిఆర్లో అనవసరమైన నిర్మాణ పనులు.. BS-III పెట్రోల్, BS-IV డీజిల్ ఫోర్-వీలర్ల దీంతో అనవసరమైన నిర్మాణ పనులు, కాలుష్య కారక ఫోర్ వీలర్ వాహనాలను నడపడంపై కేంద్రం నిషేధం విధించింది. ఢిల్లీ-ఎన్సిఆర్లో గాలి నాణ్యత 458గా నమోదవ్వడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.