Maharashtra Road Accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. జాల్నా జిల్లాలో ఓ కారు బావిలోకి దూసుకుని వెళ్లింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును బావిలో నుంచి బయటకు తీసారు. అయితే అప్పటికే కారులో ఉన్న ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని చికిత్స కోసం స్థానికి ఆసుపత్రికి తరలించారు.
పండరీపుర్ పుణ్యక్షేత్రం నుంచి తిరుగు ప్రయాణం సమయంలో కారు బావిలోకి దూసుకువెళ్లినట్లు తెలుస్తోంది.