Bus: స్కూల్ బస్సు డ్రైవర్కు గుండెపోటు రావడంతో.. ఓ విద్యార్థిని అప్రమత్తంగా వ్యవహరించి స్టీరింగ్ పట్టుకొని విద్యార్థుల ప్రాణాలు కాపాడింది. ఈ ఘటన గుజరాత్లోని రాజ్కోట్లో చోటుచేసుకుంది.
శనివారం సాయంత్రం భరద్ పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులతో వెళ్తుండగా.. ఒక్కసారిగా డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. దీంతో స్టీరింగ్ వదిలేసి పక్కకు వరిగిపోయాడు. ఈక్రమంలో అదుపు తప్పిన బస్సు ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కొట్టింది. అలాగే రోడ్డు పక్కన ఉన్న ఓ కరెంట్ స్థంభాన్ని ఢీ కొనబోతుండగా.. పక్కనే ఉన్న భార్గవి వ్యాస్ అనే విద్యార్థిని తెలివిగా వ్యవహరించి స్టీరింగ్ పట్టుకొని బస్సును నియంత్రించింది. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ పక్కనే కూర్చున్నానని.. ఆ సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాలేదని భార్గవి తెలిపింది. గొండాల్ రోడ్డు వద్దకు రాగానే డ్రైవర్ మాటలు తడబడడంతో పాటు.. అతని ముక్కులో నుంచి రక్తం వచ్చిందని.. వెంటనే కిందపడిపోయాడని చెప్పింది. వెంటనే తాను స్థీరింగ్ పట్టుకొని కరెంట్ స్థంభానికి ఢీ కొనకుండా ఆపానని వివరించింది.
ఇక స్థానికులు డ్రైవర్ను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో విద్యార్థులకు ఎటువంటి గాయాలు కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.